విజయవాడ, సూర్య బ్యూరో : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం లో మార్చి 18న డ్రా మధ్యాహ్నం 2-30 నిమిషాలకు డ్రా నిర్వహి స్తారు. హజ్ య్త్రాకు దరఖాస్తు చేసుకున్నవారు, వారి బంధు వులు భారీఎత్తున ఈ కార్యక్ర మంలో పాల్గొంటారు. 13 జిల్లాల నుంచి మొత్తం దరఖాస్తులు 3,383 వచ్చాయి. ఎ, బి కోటాలో దరఖాస్తు చేసిన వారిని మినహా ఇస్తే దరఖాస్తు చేసు కున్న వారి సంఖ్య 3,163 ఆంధ్రప్రదేశ్కు 2017 హజ్ కోటా 2,728 దక్కిం ది. వచ్చిన కోటాలో 2,728లో 220 మినహాఇస్తే మిగిలిన కోటా 2,508 రిజర్వ్ కోటా 220 పోను మిగిలిన 2,508 కోటా జిల్లాల వారీగా ఇలా వుంది. అనంతపూర్ 324, చిత్తూర్ 291, ఈస్ట్ గోదావరి 57, గుంటూరు 409, కడప 332, కష్ణా 225, కర్నూల్ 490, నెల్లూర్ 146, ప్రకాశం 103, శ్రీకాకు ళం 6, విశాఖపట్నం 63, విజయనగరం 5, వెస్ట్ గోదావరి 57, 70 ఏళ్లు పైబడినవారు, వరుసగా 4సార్లు దరఖాస్తు చేసిన వారు ప్రత్యేక క్యాటగిరి కింద కి వస్తారు. ఎ క్యాటగిరి అంటే 70 ఏళ్ళు పైబడిన వారు 156 మంది దరఖాస్తు చేసుకున్నారు. బి క్యాటగిరి అంటే వరుసగా 3 సార్లు దరఖాస్తు చేసిన డ్రాలో పేరు రాని వారు. 64 మంది నాల్గవసారి దరఖాస్తు చేసుకున్నావారు. ఎ ం బి కోటాలో డ్రాతో సంబంధం లేకుండా 220 మంది సెలెక్ట్ అయ్యారు. మంది ఇప్పట్టికే తమ ఒరిజనల్ పాస్ పోర్ట్లు హజ్ కమిటీ కార్యాలయంలో జమా చేశారు. ఎపి నుంచి హజ్ య్త్రాకు వెళ్ళడానికి డ్రా ద్వారా అవకాశం 2,508 మందికి వుంది. అయితే దరఖాస్తులు 3,163 మంది చేసుకున్నారు కాబట్టి ఎవర్ని పంపాలన్న అంశాన్ని డ్రాద్వారా మార్చి 18న నిర్ణయించనున్నారు. మార్చి 18న విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2-30 నిమిషాలకు డ్రా నిర్వహించనున్నారు. హజ్ యాత్రకు ఎ,బి క్యాటగిరి అయినా డ్రా ద్వారా సెలెక్ట్ అయిన వారైనా డబ్బులు చెల్లించా ల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు.