ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన నిరశన దీక్షలను నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి అటువంటి చర్చలకు పాల్పడకుండా ఉండటానికి కొన్ని మార్గనిర్దేశాలను వెలువరించాలని పిటిషన్లో కోరారు. ”ఢిల్లి ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తారు. మీరు (పిటిషనర్) సుప్రీంకోర్టు దానిని ఆపాలంటారు. కొట్టివేస్తున్నాం” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు.