వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారే తప్ప అభివృద్ధి లేదని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం సంతనూతలపాడు మండలం గురువారెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, దానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.