ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటితో మాకేం సంబంధం : బుద్దావెంక‌న్న‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 14, 2019, 04:18 PM

షర్మిళపై సోషల్ మీడియా ప్రచారానికి, టీడీపీకి సంబంధం లేదని, ఒకరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తమ అధినేత చంద్రబాబు ప్రోత్సహించరని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంద‌ర్భంగా  షర్మిళ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టిడిపి ధీటుగా స్పందించింది.   వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని స్ప‌ష్టంచేసారు బుద్దా. త‌మ పార్టీ నేత‌లు జగన్‌ను రాజకీయంగా విమర్శించాం గానీ.. షర్మిళను ఏనాడూ ప్రస్తావించలేదన్న విష‌యం ఆమెగుర్తెర‌గాల‌ని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com