రానున్న ఎన్నికలతో జగన్ ను భూస్థాపితం చేయడం ఖాయం అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. తన మీద ఉన్న కేసులకు భయపడి ప్రధాని మోడీని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదన్న ఎంపీదేశంలో మోడీపై తిరగబడ్డ ఏకైన నేత చంద్రబాబు మాత్రమేనన్నారు. జగన్ సరదాకి చేసిన వాకింగ్ ను పాదయాత్రగా ప్రచారం చేసుకున్నారని.. ప్రజలు ఇబ్బందులలో ఉన్న జగన్ కు పట్టదని అయనకు అయన ఓదార్పే ముఖ్యమన్నారు. జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర ముగించుకున్నారంటే అది జిల్లా ప్రజల మంచితనం మాత్రమేనన్న రామ్మోహన్ నాలుగు రోజులు పాదయాత్ర.. రెండు రోజులు జైలు యాత్ర చేసిన జగన్ ను భూస్థాపితం చేయడం ఖాయమన్నారు.