ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 10, 2019, 05:35 PM

పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్వాగతించింది. దీంతో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ గురువారం కేజ్రీవాల్‌ను ఢిల్లీలో కలిశారు. 


ఈ మేరకు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. అందులో ‘నా రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేశాను. ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటూ.. కొన్ని సమస్యలపై చర్చించాం. ఆ సమస్యలకు పరిష్కారానికి వివిధ మార్గాలను పంచుకోవాలని కోరాను’అన్నారు. చివర్లో #bengalurucentral #citizensvoice in parliament #justasking in parliament too అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com