అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు సింగపూర్ మంత్రికి నిర్మాణ వివరాలను వెల్లడించారు. ఐఏఎస్ అధికారుల క్వార్ట్రర్స్, సచివాలయం, తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఈశ్వరన్ సీఎంను అడిగి నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ఈశ్వరన్ ఆర్టీజీఎస్ సేవలను ప్రశంసించారు.