ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం తిరుపతి బయలుదేరి వెళ్లారు. తన మేనల్లుడు ఉదయ్ కుమార్ నిన్న గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. ఉదయ్ కుమార్ అంత్యక్రియలలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయ్ కుమార్ భౌతిక కాయానికి ఆయన స్వగ్రామమైన కందులవారిపల్లెలో ఈ సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, నందమూరి కుటుంబ సభ్యలు ఈ కార్యక్రమానికి హాజరౌతారు.