శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 318వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 318వ రోజు పాదయాత్రను శ్రీకాకుళం నియోజకవర్గంలో రాగోలు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర దుసి క్రాస్, బావాజీపేట, రాగోలుపేట, గట్టుముడిపేట, వంజంగి, వాకాలవలస క్రాస్, లంకం క్రాస్ మీదుగా నందగిరిపేట వరకు కొనసాగనుంది.