బీజేపీయేతర పక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని కానిస్టూషన్ క్లబ్లో సమావేశం ప్రారంభంకానుంది. భవిష్యత్తు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పలువురు ముఖ్యమంత్రులను చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.
వీరితో పాటు మహారాష్ట్రలోని ఎన్సీపీ అధినేత శరత్పవార్, జమ్మూకశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఊమర్ అబ్దుల్లా, సమాజ్వాది పార్టీ అధినేతలు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత స్టాలిన్ పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.