అమరావతి: త్రిసభ్య కమిటీ జలరవాణాపై ప్రభుత్వానికి ఓ నివేదికను అందించింది. ప్రభుత్వ సిఎస్ దినేష్ కుమార్ కు ఈ నివేదికను అందించారు. పవిత్ర సంగమం, పోలవరం దగ్గర జరిగిన పడవ ప్రమాద స్థలాలను పరిశీలించిన త్రిసభ్య కమిటీ జల రవాణా, ట్రాఫిక్ నియంత్రణ మీద ఈ నివేదికను తయారుచేసింది. జలరవాణా అభివృద్ధి, పర్యవేక్షణకు సంబంధించిన అంశాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ నివేదికలో ఇచ్చారు.