అమరావతి: రేపటి వైసీపీ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వట్లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామన్నారు. పదేపదే బంద్ల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ విధానం స్పష్టంగా ఉందన్నారు.