ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు దళితతేజం సభపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 23, 2018, 03:40 PM

అమరావతి:  నెల్లూరు దళితతేజం సభపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు నక్కా ఆనందబాబు, జవహర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దళిత నేతలు, ఎస్సీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ సంక్షేమానికి నాలుగేళ్లలో రూ.40వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  ఏటా బడ్జెట్‌లో 90 శాతానికి పైగా ఖర్చు చేసిన ఘనత దక్కిందన్నారు. ఏటా 10 లక్షల కుటుంబాలకు 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉపప్రణాళిక నిధులు సక్రమంగా వినియోగిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఆదాయం నెలకు కనీసం రూ.10వేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళిత విద్యార్థుల విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com