ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కల్యాణ్‌తో మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 23, 2018, 02:33 PM

విజయవాడ:  విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పవన్‌తో భేటీ అయిన నాదెండ్ల మనోహర్‌ పలు అంశాలపై చర్చిస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పని చేసిన కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నాలుగు రోజుల క్రితమే నాదెండ్ల మనోహర్ తో పాటు, ఇతర ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇంతలోనే పవన్ తో మనోహర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ అంశాలతో పాటు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు మనోహర్ దూరంగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com