కడప: ఉక్కు పరిశ్రమ సాధనకు దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను మంత్రి అచ్చెన్నాయుడు, పితాని లు పరామర్శించారు. ఉక్కు పరిశ్రమ సాధనకు కడప జడ్పీ కార్యాలయ ఆవరణలో చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న మంత్రి అచ్చెన్నాయుడు, పితానిలు సి.ఎం.రమేష్, రవిలను పరామర్శించి సంఘీభావం తెలిపారు.