గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్వతీపురం ఐటిడిఎ యూత్ ట్రెయినింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో లోకేశ్ సమావేశమై ముఖాముఖీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజయకృష్ణ, జడ్పీ ఛైర్ పర్సన్ స్వాతి రాణి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఐటిడిఎ పిఒ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.