అమరావతి : ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురు తిరగడం ద్వారా ఏపీ సమస్యలను తొలిసారిగా జాతీయ స్థాయిలో గుర్తించేలా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అఖిల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. నాలుగేళ్లు ఎన్డీయేలో మిత్ర పక్షంగా ఉండి ఏపీకి విభజన హామీల సాధనకు ఎంతో కృషి చేశామనీ, ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని కేంద్రం నమ్మకంగా చెప్పడంతోనే దానికి సమానమైన ప్యాకేజీ కోసం పట్టుబట్టామని చంద్రబాబు వివరించారు. అయితే తరువాత ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కొనసాగిస్తున్న విషయం తెలిసి ఏపీకి కూడా ఇవ్వాలని గట్టిగా అడిగామని, దానిపైనే ముందు కేంద్ర కేబినెట్ నుంచి ఆ తరువాత ఎన్డీయే నుంచి వైదొలగినట్లు చంద్రబాబు వివరించారు.