న్యూఢిల్లి : నేపాల్ రాజధాని ఖాట్మండూనుంచి భారతదేశానికి కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. నేపాల్ ప్రధాని కెపి ఒలితో కలిసి మోడీ నేడిక్కడ మీడియాతో మాట్లాడుతూ నేపాల్తో జల మార్గాలను, రైలు మార్గాలను మెరుగుపరచుకోవాలని నిర్ణయించామన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.