న్యూఢిల్లి : రాజ్యసభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీనితో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. గందరగోళం మధ్యే ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను కొద్దిసేపు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. లోక్సభ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలోకి రాగానే విపక్షాలు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లాయి. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.