ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలన్నదే బీజేపీ వ్యూహం : గల్లా జయదేవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 01:54 PM

న్యూఢిల్లీ : ఏపీలో తెలుగుదేశం పార్టీని బలహీన పరిచి తాను బలపడాలన్న వ్యూహంతో బీజేపీ పని చేస్తున్నదని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. లోక్ సభ వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన తమిళనాడులోనూ, ఇతర రాష్ట్రాలలోనూ బీజేపీ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లిందన్నారు. తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం బీజేపీ తరం కాదన్నారు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చించకుండా కేంద్రం పారిపోయిందని ఎద్దేవా చేశారు. సభ ఆర్డర్ లో లేదంటూ వాయిదా వేయడం సిగ్గు చేటన్నారు. ఆర్థిక బిల్లు ఆమోదం సమయంలో సభ ఆర్డర్ లో ఉందా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com