అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లి వ్యూహకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు తీరును సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో అన్నారు. ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీకి పార్లమెంటు ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలన్నారు.