చిత్తూరు : ఎపికి ప్రత్యేక హౌదా కోసం చిత్తూరు ఎంపి శివప్రసాద్ డప్పు కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దండోరా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర ప్రారంభమైన ఈ కార్యక్రమం చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లనుంది. బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసిందన్నారు. విభజన హామీలు నెరవేరుస్తామని మాటిచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక్కటీ నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హౌదా సాధించడం మన హక్కు అని...ఇందుకోసం ప్రజలంతా ఏకమై సాధించుకుందామంటూ దండోరా వేస్తూ ఎంపి శివప్రసాద్ పిలుపునిచ్చారు.