కాకినాడ : సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నా, ర్యాలీలో 2000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.