ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్షనర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనాబుల్డ్ కామన్ పోర్టల్‌

national |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 09:02 PM

పెన్షనర్ల సేవకోసం కేంద్ర ప్రభుత్వం ఓ పోర్టల్ ను ప్రారంభించనున్నది. పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనాబుల్డ్ కామన్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతుంది. పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం త్వరలోనే ఈ పోర్టల్‌ను లాంచ్ చేయనుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 'Bhavishya' లబ్దిదారులతో మాట్లాడిన జితేంద్ర సింగ్ దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లతో, వారి అసోసియేషన్లతో ఈ పోర్టల్ నిరంతరం అందుబాటులో ఉండటమే కాకుండా.. వారి ఇన్‌పుట్‌లను, సూచనలను స్వీకరించడం, సమస్యలకు వెనువెంటనే పరిష్కారాలు కనుగొనడం చేయనుందని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ సులభతర జీవనాన్ని అందించాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశ్యమని తెలిపారు. ఏఐ ఎనాబుల్డ్ ఈ పోర్టల్ పెన్షనర్లకు ఆటోమేటిక్‌గా అలర్ట్‌లను పంపుతుందని, పెన్షన్ పేమెంట్లను ట్రాక్ చేస్తుందని చెప్పారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన పారదర్శకత, డిజిటైజేషన్, సర్వీసు డెలివరీకి అనుగుణంగా ప్రస్తుతం ఈ భవిష్య పోర్టల్ పెన్షన్ ప్రాసెసింగ్, పేమెంట్లలో ఎండ్ టూ ఎండ్ డిజిటైజేషన్‌ను అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ప్రీ-రిటైర్‌మెంట్ వర్క్‌షాపులను కూడా అధికారులు నిర్వహించాలని జితేంద్ర సింగ్ సూచించారు. పెన్షన్ సంస్కరణలు కేవలం పాలనాపరమైన సంస్కరణలు మాత్రమే కాదని, సామాజిక పరంగా వీటికి అనూహ్యమైన స్పందన వస్తున్నట్టు తెలిపారు.


దేశ మారుమూల ప్రాంతాలలో పనిచేసి రిటైర్ అవుతోన్న పెద్ద మొత్తంలో సాయుధ దళాలను ఉద్దేశించి.. వారికి పెన్షన్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌లను ప్రభుత్వం తీసుకొస్తుంది. గతంలో ఈ పెన్షన్ కోసం పింఛనుదారులు కాళ్లు అరిగేలా నెలల తరబడి తిరిగే వారు. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా తేలిగ్గా పూర్తవుతుంది. పెన్షనర్ల మొబైల్‌కి ప్రభుత్వం అలర్ట్‌లను కూడా పంపుతోం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com