ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు, ఇతర అభివృద్ధి అంశాలపై నడ్డాతో చర్చించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలను కూడా సుజనా నడ్డాకు వివరించారు. సమావేశంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సుజనా చౌదరి సోషల్ మీడియాలో జేపీ నడ్డాను కోరారు. అమరావతి నిర్మాణం, రైల్వే జోన్ పనులు వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు.