నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో శుక్రవారం రాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. అయితే ఘటనలో డ్రైవర్కు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా వున్నాయి. పెద్దకంబలూరు నుండి పందిళ్లపల్లెకు వెళ్ళే దారిలో మట్టి తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న బీడు భూముల్లో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జెసిబి సహాయంతో స్థానికులు ట్రాక్టర్ ట్రాలీని బయటకు తీశారు.