మహమ్మద్ ప్రవక్త పై భాజపా నాయకులు నూపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ముస్లిం నాయకులు మస్తాన్ ఖాన్, మహ్మమ్మద్ సాహెబ్, గపూర్ పేర్కొన్నారు.
నమాజు అనంతరం జామీయా మసీదు హఫీజ్ మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్యాపిలి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఉప తహసీల్దార్ మారుతీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జహంగీర్ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లింలు , ఖాజాపీర్, ఖాదర్, రషీద్, షాకీర్ అహమ్మద్, ఖాజా, బాషా, హస్సేన్, కమాల్ పాల్గొన్నారు.