ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీల రూపంలో నష్టపోనున్న ఏపీ, తెలంగాణ..ఆర్థిక నిపుణుల హెచ్చరికలు

national |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:36 PM

తీసుకొన్న అపుతో తెలుగు రాష్ట్రాలు రానున్న రోజుల్లో నష్టపోనున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే రుణం విషయంలో ఉన్నమూడు సౌకర్యాలనూ వాడుకున్నాయి. ఆ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ లో ప్రతి సంవత్సరం పెట్టే వార్షిక పెట్టుబడుల ఆధారంగా స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్పులపై రెపోరేటు కంటే 2 శాతం తక్కువగా వడ్డీ వసూలు చేస్తారు. ఇదే సౌకర్యాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల ఆధారంగా వాడుకుంటే 1 శాతం మాత్రమే తక్కువ వడ్డీ ఉంటుంది.


ఎస్ డీఎప్, వేస్ అండ్ మీన్స్ సౌకర్యాలు పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటాయి. వేస్ అండ్ మీన్స్ కింద అర్హత ఉన్న మొత్తానికి సమానంగా తీసుకుంటే 2 శాతం, 100శాతానికి మించి తీసుకుంటే 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆధారం రోజువారీ అవసరాలకు సరిపోనప్పుడు ఇవి ఆర్బీఐ వద్ద స్వల్పకాలానికి ఈ మూడింటిలో ఏదైనా ఒక సౌకర్యం ద్వారా అప్పు చేస్తుంటాయి. అయితే, ఈ సౌకర్యాలను అత్యధిక రోజులు ఉపయోగించుకున్న రాష్ట్రాలు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com