సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం మొక్కాపాడులో గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమములో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమ పధకాల గురించి ప్రజలను ఆరా తీశారు. గడప గడపకు వెళ్లి ప్రజలతో ముచ్చటించి మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పథకాల పట్ల దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆకర్షితులవుతున్నారని వారి రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని మంత్రి రాంబాబు తెలిపారు.