ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మే 25న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బహుజన్ ముక్తి పార్టీ సహరాన్పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధీమాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్రం కులాల వారీగా జనాభా గణన చేపట్టనందునే బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంల కుంభకోణం,ప్రైవేట్ రంగంలో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై కూడా ఆయన లేవనెత్తారు. బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు డీపీ సింగ్ కూడా భారత్ బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కేంద్రం కులాల ప్రాతిపదికన ఓబీసీ జనాభా గణన చేపట్టలేదని, ఈవీఎం కుంభకోణంపై విచారణ జరిపించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎంఎస్పి గ్యారెంటీ, ఎన్ఆర్సి, సిఎఎలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించేలా చట్టం చేయాలని వారు కోరుతున్నారు.