ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బులేనా జీవితం.. ఇంకేమీ లేదా?: కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చి సన్యాసం తీసుకున్న కుటుంబం

national |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 08:45 PM

ప్రాపంచిక సుఖాలను త్వజించి, ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఓ నగల వ్యాపారి కుటుంబం కోట్లాది రూపాయల విలువైన తమ యావదాస్తులను విరాళంగా ప్రకటించింది. భార్య, కుమారుడితో కలిసి సన్యాసం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నారు.


వ్యాపారాలు చేసి కోట్ల సంపాదించిన అతడికి ఈ ఆస్తులపై విరక్తి కలిగింది. ఎప్పుడూ ఈ ప్రాపంచిక సుఖాలు, డబ్బులేనా జీవితం? ఇంకేమీ లేదా? జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా? డబ్బువెనుక పరుగులు తీయాలా? అనే ఆలోచన వచ్చింది. ఇదే, కాదు తనకు ఇంకేదో కావాలి అనిపించింది. కొన్నేళ్లకు తత్వం బోధపడటంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను ఆస్తి అంతా రూ.11 కోట్ల విలువైన ఆస్తిని గోశాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళంగా రాసిచ్చేస్తున్నాటు ప్రకటించారు.


 మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన నగల వ్యాపారి రాకేశ్‌ సురానా తమ కుటుంబానికి ఉన్న రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. వీటిని గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు రాసిచ్చారు.


ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్‌ సురానా తెలిపారు. తన భార్య లీనా సురానా (36), కుమారుడు అమయ్‌ సురానా (11)తో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని ఆయన వెల్లడించారు. మే 22న జైపూర్‌లో సన్యాస దీక్ష స్వీకరించనున్నామని, గురు మహేంద్ర సాగర్‌, మనీష్ సాగర్ మహారాజ్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్‌ సురానా పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆ కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. ఈ వేడుకకు జనం భారీగా తరలివచ్చారు.


సురానా నిర్ణయాన్ని జైన సమాజం స్వాగతించింది. అమెరికాలో చదువుకున్న రాకేశ్ భార్య లీనాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికం బాటలో పయనించాలనే కోరిక ఉండేది. అంతే కాదు కొడుకు అమయ్ నాలుగు ఏళ్ల వయసులో ఆధ్యాత్మికం గురించి మాట్లాడేవాడు. అయితే, కుమారుడిది చాలా చిన్నవయసు కావడంతో అతడికి 11 ఏళ్లు వచ్చే వరకూ ఈ కుటుంబం ఎదురుచూసింది.


రాకేశ్ సురానా బాలాఘాట్‌లో బంగారం, వెండి నగల దుకాణం చిన్నదిగా మొదలుపెట్టారు. క్రమంగా వీరి వ్యాపారం అభివృద్ధి చెందడంతో కోట్ల రూపాయలు ఆస్తి కూడబెట్టారు. ఆస్తులతో పాటు పేరు, ప్రతిష్ఠలు కూడా సంపాదించినా ఆయనకు ఎక్కడో తెలియని వెలితి వెంటాడింది. దీనికి ఆధ్యాత్మిక మార్గం సరైందని భావించిన రాకేశ్ సురానా.. ఆస్తులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. స్థానికుల ప్రకారం.. రాకేశ్ భార్య లీనా తల్లి, సోదరి ఇప్పటికే సన్యాసం స్వీకరించారు. కానీ, 2017లో తల్లి మోక్షం పొందారు. ప్రస్తుతం వీరు కూడా వారి బాటలోనే పయనించాలని భావించి ఈ నిర్ణయానికి వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com