విశాఖపట్నం: పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో విశాఖ లో పర్యటిస్తారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతారన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులతో మాట్లాడి వారిని ఒప్పిస్తారని చెప్పారు. ఇన్ని రోజులు ఓపికగా పరిస్థితి వేచి చూశామని.. ఇప్పుడు తమ స్వరం వినిపిస్తున్నామన్నారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించారని తెలిపారు. పవన్ కళ్యాణ్పై కేసులు లేవని.. రాజీలు కోసం కలవలేదని... రాష్ట్ర సమస్యలపై బలంగా వాణిని వినిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ వచ్చిన తరువాత వచ్చిన సమస్యలు మరెప్పుడు రాలేదన్నారు. అమరావతి రైతులు ఉద్యమం పట్ల కూడా జనసేన వైఖరి స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. ఇతర పార్టీలు అధికార పార్టీపై పోరాటానికి భయపడుతున్నాయని...తాము భయపడటంలేదని అన్నారు. ఇన్ని రోజులు వేచి చూసారని..ఇంకొద్ది రోజులు వేచి చేస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోరాడతారో అందరూ చూస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.