ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కరోనా ఉధృతి

national |  Suryaa Desk  | Published : Thu, Aug 26, 2021, 10:29 AM

 దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 34,159 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 607 మంది బాధితులు వైరస్‌ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,25,58,530కు చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 మంది కోలుకున్నారు.


వైరస్‌ ప్రభావంతో మొత్తం 4,36,365 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,33,725 ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.03శాతమని, రికవరీ రేటు 97.63శాతంగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 60.38 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మొత్తం 51.31 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. తాజా కేసుల్లో అత్యధికంగా కేరళ నుంచే ఉన్నాయి. నిన్న కేరళలో 31,445 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 215 మంది మృత్యువాతపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com