దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరగాల్సిన సీజీఎల్, హెచ్ఎస్ఎల్ పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రకటించింది. వీటితో పాటు ఎస్సెస్సీ జీడీ కానిస్టెబుల్ నోటిఫికేషన్ ను వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం సీహెచ్ఎల్ టైర్-1 పరీక్ష మే 21, 22 తేదీల్లో, సీజీఎల్ టైర్-1 పరీక్ష ఈ నెల 29 నుంచి జరగాల్సి ఉన్నాయి. అలాగే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ నెల మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. వాయిదా పడిన నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. అదేవిధంగా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా ఎస్సెస్సీ వెబ్సైట్ ssc.nic.inలో చూడాలని వెల్లడించింది.