ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మాస్క్‌ ధరించకపోతే జరిమానా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 09:07 AM

ఏపీలో మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని, మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా విధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 1-9 తరగతులకు సెలవులు ప్రకటించామని, హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లు సైతం మూసివేయాలని అన్నారు. ఫంక్షన్‌ హాళ్లలో రెండు కుర్చీల మధ్య 6 అడుగుల దూరం.. థియేటర్లలో ప్రతి 2 సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com