బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్ పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కూతుర్ని తన భర్త మోసం చేశాడని, వేరే కాపురం పెట్టాడని ఆమె ఆరోపించింది. దయచేసి అతనికి ఓటేయొద్దని, ప్రజా ప్రతినిధి అయ్యే అర్హత అతనికి లేదని శర్బరీ సింఘా రాయ్ మీడియా ముందుకు వచ్చి చెప్పింది. యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. వారి నుంచి చాలా డబ్బు దోచుకున్నాడని, ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులను కోరినట్లు శర్బరీ పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఏ పార్టీకీ మద్దతుగా మాట్లాడటం లేదని, తన వెనక ఏ పార్టీ కూడా లేదంటూ శర్బరీ తెలిపింది.