దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు ఉధృతమవుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో పర్యటించినప్పడు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించానని, దాంతో పాజిటివ్గా నిర్థారణ అయ్యిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.ప్రస్తుతం తాను హోంక్వారంటైన్లో ఉన్నానని, ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కొద్దిరోజులపాటు హోంక్వారెంటైన్లో ఉండాలని కోరారు.