ఈఎస్ఐ స్కాంలో అరెస్టు అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య మెరుగుపడిందని డాక్టర్లు వెల్లడించారు.దీంతో ఏసీబీ అధికారులు ఆయనను నేరుగా సబ్జైలుకు తరలించారు. తనకు కరోనా పరీక్షలు చేశాక మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం అచ్చెనాయుడి ఆరోగ్యం బాగాలేదని ఆయన లాయర్ వాదించారు. కోర్టులో ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతారని చెప్పారు. ఐతే తీర్పును రిజర్వ్లో పెట్టిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 3న నిర్ణయాన్ని వెల్లడించనుంది.