భారత క్రికెట్ జట్టు ప్రతి ఫార్మాట్లోనూ విజయవంతం కావాలంటే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సిఎ) హెడ్ రాహుల్ ద్రావిడ్ మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమని భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. గంగూలీ గత అక్టోబర్లో బీసీసీఐ 39 వ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు, గత ఏడాది జూలైలో ద్రవిడ్ ఎన్సిఎ హెడ్ గా ఎన్నికయ్యాడు. లక్ష్మణ్ మాట్లాడుతూ... సౌరవ్ గంగూలీ మరియు రాహుల్ ద్రావిడ్ 1996 లో లార్డ్స్ క్రికెట్ మైదానంలో కలిసి తమ టెస్ట్ అరంగేట్రం చేశారు. అప్పుడు మ్యాచ్ లో వారి భాగస్వామ్యం చాలా బాగుంది. ఇప్పుడు కూడా గంగూలీ మరియు ద్రవిడ్ మధ్య భాగస్వామ్యం బాగుండాలి. ఎందుకంటే... ప్రతి ఫార్మాట్లోనూ భారత్ విజయవంతం కావాలంటే, ఈ భాగస్వామ్యం చాలా ముఖ్యం. అయితే జట్టు కెప్టెన్ కూడా వీరితో కలిసి పనిచేస్తే జట్టు ఇంకా ఉన్నతస్థాయిలో ఉంటుంది అని వివిఎస్ లక్ష్మణ్ అన్నారు.