ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారితో పెట్టుకున్నవారు ఏమయ్యారో తెలుసా: జగన్ పై బైరెడ్డి ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 27, 2020, 10:24 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. జగన్ కు పరిపక్వత లేదంటూ ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములను అమ్మాలనుకోవడం దుర్మార్గపు చర్య అంటూ విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై గతంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని నాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి చైర్మన్ చేశారని గుర్తు చేశారు.కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ఆలయం మెుత్తం నాన్ హిందువుల చేతిలో ఉందని చెప్పుకొచ్చారు. శ్రీవారి భూముల అమ్మకం విజయవంతమైతే ఆస్తులు మెుత్తం అమ్ముతారని ఆరోపించారు. టీటీడీ ఆస్తుల అమ్మకం నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయని ఇకనైనా టీటీడీ పాలకమండలి, జగన్ సర్కార్ ఈ వ్యవహారంలో భక్తుల మనోభవాలకు అనుగుణంగా వ్యవహరించాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com