లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా ఏపీ సర్కార్ కొన్నింటికి మినహాయింపునిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు మినహాయింపు. టీ, కాఫీ, రబ్బర్, కాష్యు మొదలైన ఉత్పత్తులలో 50% మంది కార్మికులను అనుమతించింది. పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించిన వాటిపై సడలింపునిచ్చింది. వైద్య రంగానికి, అంగన్వాడీలు, ప్రావిడెంట్ ఫండ్ సర్వీసులకు అనుమతిచ్చింది. బ్యాంకులు, ఏటీఎంలకు కూడా మినహాయింపునిచ్చింది. విద్యా వ్యవస్థకు, రవాణా వ్యవస్థకు, సినిమా హాళ్లు, బార్లు, మాల్స్, గుళ్లు, చర్చిలు, మసీదులు తదితరాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఎటువంటి సడలింపులూ లేవని ప్రభుత్వం తెలిపింది.