ఏపీ రైతులకు సర్కార్ మరో శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ కారణంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు పండ్లు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు వారి పెట్టిన పెట్టుబడి వెళ్లని పరిస్థితి ఉంది. దీంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పండ్ల తోటలు సాగు చేసిన రైతుల నుంచి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి జిల్లా ప్రజలకు అతి తక్కువ ధరకే అమ్మేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లు బంద్ ఉన్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 100 రూపాయలకే 5 రకాల పండ్లు పంపిణీ చేసేందుకు ఉద్యానవన శాఖ యోచిస్తుంది. అందులో 8 అరటిపండ్లు, ఐదు స్వీట్ ఆరెంజ్, ఒక కర్బుజ కాయ, బొప్పాయి పండు, ఐదు నిమ్మకాయలను అందించనున్నారు. వీటి వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరగనుంది. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.