ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా ప్రకాశం(11), విశాఖపట్నం(10), గుంటూరు(9), కృష్ణ(5), తూర్పుగోదావరి(4) జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో రెండు కేసులు నిర్ధారణ కాగా.. చిత్తూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కో కేసు నమోదైంది.
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా 44 కేసుల్లో ఇద్దరు కోలుకోవడం కాస్త ఊరట లభించింది. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.