ఢిల్లీల్లోని నిజాముద్దీన్ పేరు చెబితేనే యావత్ భారత దేశం వణికిపోతుంది. ఇటీవలే మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మందికి వైరస్ సోకింది. వీరిలో ఏకంగా తెలంగాణలో ఆరుగురు చనిపోయారు. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 21 మందికి ఏపీలో కరోనా పాజిటివ్ తేలింది. ఇదిలావుంటే ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సైతం ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరయ్యారని ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కాకరేపుతోంది. ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగొచ్చిన తర్వాత అంజాద్ బాషా ఎన్పీఆర్ విషయంలో ముస్లీం మత పెద్దలతో కలసి సీఎం జగన్ తో కలసి సమావేశమయ్యారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఖండించారు. తనపై ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అంజాద్ బాషా స్పష్టం చేశారు. తాను మార్చి నెల 2వ తేదీన ముస్లీంలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీకి వెళ్లానని.. కానీ అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు డిప్యూటీ సీఎం అన్నారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో కూడ అంజద్ బాషా పాల్గోన్నారు. అయితే అంజాద్ బాషా మార్చి 2న నిజాముద్దీన్ మసీద్ కు వెళ్లినట్లు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో నిజంగానే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రార్థనలకు వెళ్లారా..? లేదా అన్న దానిపై ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరీ ఇలాంటి అటు ప్రభుత్వానికి ఇటు డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు సంకటంగా మారిందనే చెప్పవచ్చు.