ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబును ప్రశ్నించిన మంత్రి కన్నబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 07:06 PM

నరకాసుర పాలన అంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, నవరత్నాల పేరుతో ప్రజారంజక పాలన అందించడం సీఎం జగన్ చేసిన తప్పా అని చంద్రబాబును మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. . అధికార వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జగన్ చేసిన తప్పా అని మంత్రి నిలదీశారు. జగన్‌ను చూస్తే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని, అందుకే కృత్రిమ ఉద్యమాలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మీరంటున్న నరకాసుర పాలనపై దమ్ముంటే చర్చకు రండి అంటూ సవాల్ విసిరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందులో జగన్‌కు ఆహ్వానం రాలేదంటూ సోషల్ మీడియాలో అభ్యంతరకర ప్రచారం చేశారని మండిపడ్డారు. ట్రంప్‌తో ఫోటోలు దిగాలని, జాతీయనేతలతో కలిసి చేతులు ఊపాలని జగన్‌కు లేదన్నారు. ఎప్పుడూ ప్రజలతో ఉండాలనే జగన్‌ కోరుకుంటారని, బాబు భయపడుతున్నారు కాబట్టే స్థానిక ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com