ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుడితో ఆంటీ ఎఫైర్..చివరికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 07:33 PM

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పుంగవర్ నత్తం గ్రామానికి చెందిన షణ్ముగానికి 58 సంవత్సరాలు. ఆయన చాలా రోజుల క్రితమే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. మారియమ్మల్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. మరియామ్మల్ కు 46 సంవత్సరాలు. వీరు అరుంధతినగర్ లో నివాసం ఉంటున్నారు. షణ్ముగం పొలం పనుల నిమిత్తం ఉదయం వెళితే సాయంత్రం వరకు వచ్చేవాడు కాదు. వీరి పిల్లలకు పెళ్లిలు కావడంతో మారియమ్మల్ ఒక్కతే ఇంట్లో ఉండేది.
ఇదే క్రమంలో వీరి ఇంటి ఎదురుగా ఉండే రామమూర్తి అనే 27 ఏళ్ల యువకుడితో మారియమ్మల్ కు పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. నిత్యం మారియమ్మల్ తో రామమూర్తి రాసలీలలు కొనసాగించేవాడు. షణ్మగం ఉన్నప్పుడు కూడా రామమూర్తి వచ్చి ముచ్చట పెడుతుండేవాడు. రామమూర్తి కొడుకు వయస్సు ఉన్నవాడు కావడంతో వారి పై షణ్ముగానికి కూడా అనుమానం రాలేదు.


తాను ఇంట్లో లేని సమయంలో కూడా రామ్మూర్తి తమ ఇంటికి వస్తున్నాడన్న విషయం షణ్ముగానికి తెలియడంతో భార్యను నిలదీశాడు. మంచినీళ్ల కోసం వస్తాడని షణ్మగాన్ని మారియమ్మ నమ్మించింది. ఫిబ్రవరి 20 గురువారం రాత్రి షణ్ముగం భోజనం చేసి ఆరు బయట పడుకున్నాడు. ఉదయాన్నే షణ్ముగం పొలానికి పోయి ఉంటాడని భావించిన మారియమ్మ ఏం ఆలోచించకుండా ప్రియునికి ఫోన్ చేసి రమ్మంది. ఆంటీ రమ్మంది కదా అని రామ్మూర్తి ఏం ఆలోచించకుండా నేరుగా వారి ఇంటికి వచ్చాడు. బయట ఉన్న షణ్ముగాన్ని గమనించలేదు.
ఇంట్లో బెడ్రూంలో వారు రాసలీలలు సాగిస్తుండగా షణ్ముగం చూశాడు. ఆవేశంతో కత్తి తీసుకొని భార్య, అతని ప్రియుని పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో వారు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కన్నుమూశారు. అనంతరం షణ్ముగం పశువందనై పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య కొడుకు వయసున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని చూసి సహించలేకే చంపేసినట్లు చెప్పాడు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com