వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎన్డీయే కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరు మండలంలోని పర్చూరు, అన్నంబొట్లవారిపాలెం, ఏడారుపల్లె, తిమ్మరాజుపాలెం, చెన్నంబొట్ల అగ్రహారం, బోదవాడ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ పర్యటించి, టీడీపీ గుర్తు సైకిల్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. పర్చూరు అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎంపీ అభ్యర్థి టి. కృష్ణప్ర సాద్ల గెలిపించాలని కోరుతూ సీనియర్ టీడీపీ నేత, గొనసపూడి మాజీ సర్పంచి బత్తుల కల్యాణి తదితరులు చినగంజాం మండలం గొనసపూడిలో ప్రచారం నిర్వహించారు. కారంచేడులో తెదేపా శ్రేణులు చేపట్టిన ఇంటింట ప్రచారం ఉత్సాహాన్ని రేకెత్తించింది