బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించాయి. ఆ తర్వాత రాజధానితో పాటు నోయిడాలోని దాదాపు 100 పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి రష్యా నుంచి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.