అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలు సబర్మతి ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీ వారికి స్వాగతం పలికారు. అంతకు ముందు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమానికి ట్రంప్ కాన్వయ్ చేరుకునే దారికి ఇరువైపులా జనం త్రివర్ణ పతాకాలతో సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు చరఖా వడికారు.