రాజధాని నగరం కాబూల్కు నైరుతి దిశలో ఉన్న ఘజ్ని ప్రావిన్సులోని దెహ్ యాక్ జిల్లాలో ఈ విమానం కూలిందని ప్రావిన్సు అధికార ప్రతినిధి స్థానిక మీడియాకు చెప్పారు.సాంకేతిక కారణాల వల్ల విమానంలో మంటలు చెలరేగాయని, అనంతరం విమానం కూలిపోయిందని అధికార ప్రతినిధి చెప్పారు.ఈ విమానం అరియానా ఎయిర్లైన్స్కు చెందినదని తొలుత వార్తలు వెలువడ్డాయి, కానీ ఆ కంపెనీ మాత్రం వీటిని తోసిపుచ్చింది‘‘అరియానా విమానాలు అన్నీ తమతమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఏవీ కూలిపోలేదు. కాబట్టి, కూలిన విమానం అరియానా ఎయిర్లైన్స్కు చెందినది కాదు’’ అని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు.ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి గురించి ఎలాంటి సమాచారాన్ని అధికారులు ఇవ్వలేదు.